Friday, May 10, 2024

ఎయిర్ పోర్టులో పేలుడు కలకలం..

జమ్ముకశ్మీర్‌లోని జమ్ము ఎయిర్‌పోర్టులో బాంబు పేలుడు కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులోని ఏర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. పేలుడుకు ఎయిర్ పోర్ట్ లోని ఓ భవనం పైకప్పు దెబ్బతింది. దీనిపై సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్‌, ఫోరెన్సిక్ నిపుణులు ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు చేరుకుని తనిఖీలు చేస్తున్నాయి. అలాగే, స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఎయిర్ పోర్టు ప‌రిస‌రాల్లో త‌నిఖీలు చేస్తున్నారు. అయితే ఎందుకు, ఎలా సంభవించాయనే విషయాలు తెలియాల్సి ఉన్నది.

ఇది ఉగ్రవాదుల చ‌ర్యేనా అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు చేస్తున్నారు.  ఎన్‌ఐఏ, ఎన్ఎస్‌జీ బలగాలు కూడా ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో పేలుళ్ల‌పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ స్పందించి,  వైస్‌ ఎయిర్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ హెచ్‌ఎస్‌ అరోరాతో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. ఎయిర్‌ మార్షల్‌ విక్రమ్ సింగ్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement