Wednesday, May 15, 2024

ఆరోగ్యంగానే వున్నా – ఆందోళ‌న వ‌ద్దు-ధ‌ర్మేంద్ర‌

న‌డుంనొప్పి కార‌ణంగా ఆసుప్ర‌తికి వెళ్లాన‌ని ..ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు ధ‌ర్మేంద్ర‌.. మరోమారు ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో స్పందించి వివరణ ఇచ్చారు. భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నరు ధర్మేంద్ర. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరా సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత షోలే, చుప్కే చుప్కే, యాదోం కీ బారాత్, సత్యకామ్, సీతా ఔర్ గీతా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహనీ సినిమాలో ధర్మేంద్ర నటిస్తున్నారు. ఈసినిమా లో ధర్మేంద్రతో పాటు జయాబచ్చన్, షబానీ ఆజ్మీ, అలియా భట్, రణ్‌వీర్ సింగ్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ధర్మేంద్ర ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement