Sunday, May 5, 2024

బాణ‌సంచా ఫ్యాక్ట‌రీలో పేలుడు – ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం..

విరుద్ న‌గ‌ర్ (త‌మిళ‌నాడు ) – విరుద్ న‌గ‌ర్ జిల్లాలోని ఒక బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో నేటి ఉద‌యం పేలుడు సంభ‌వించింది.. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెంద‌గా, మ‌రో నలుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.. విల్లుప‌ట్నంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.. పేలుడు జ‌రిగిన అనంత‌రం ఈ కేంద్రంలో మంట‌లు ఎగిసిప‌డ్డాయి.. వెంట‌నే ఫైర్ సిబ్బంది రంగ ప్ర‌వేశం చేసి మంట‌ల‌ను అదుపు చేశారు.. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement