Wednesday, May 8, 2024

BJP – విప‌క్ష I-N-D-I-A కూట‌మిని ఉగ్ర‌సంస్థ‌గా పోల్చిన ప్ర‌ధాని మోడీ….

న్యూ ఢిల్లీ – ప్రతిపక్ష కూటమి I-N-D-I-A పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేరు మార్చుకున్నంత మాత్రాన వాటి తీరుమారదని తేల్చిచెప్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులోనూ ఇండియా ఉందని ప్రధాని గుర్తుచేశారు. అంతేకాదు, పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులోనూ ఇండియా ఉందని విమర్శించారు. ఇప్పటి వరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాలను చూడలేదని మండిపడ్డారు. ఈమేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటు లైబ్రరీ భవనంలో మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. విపక్షాల కూటమిపై విమర్శలు గుప్పించారు. పేరు మార్చుకుని ఇండియా అని పెట్టుకున్నంత మాత్రానా వాటి తీరు మారుతుందని అనుకోలేమని చెప్పారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని మోడీ గుర్తుచేశారు. కాగా.. ఈ సమావేశంలో మణిపూర్ హింస నేపథ్యంలో విపక్షాల ఆందోళన, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement