Tuesday, May 21, 2024

పంచింగ్ ఫలక్ నుమాకే పంచ్… కేటీఆర్ కి బిజెపి కౌంటర్

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో బయలుదేరేముందు గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకొని వచ్చాను అంటూ బీజేపీ పై సెటైర్ వేశారు. ఇక కేటీఆర్ సెటైర్ కు వెంటనే బిజెపి కౌంటర్ ఇచ్చింది. ఓటు వేయడానికి వచ్చే ముందు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగి ఎల్లా స్వామి కి మొక్కుకుని వచ్చి ఓటు వేశాను అంటూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్ర రావు అన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు పిఆర్సి త్వరగా రావాలని దేవుడికి మొక్కుకుని వచ్చానన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే వస్తాయని ఆశిస్తున్నాను. నా విజ్ఞప్తి మేరకు ఆదివారం పోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు. పట్టభద్రులు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏడేళ్లుగా తెలంగాణ లో యువత ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఎంతో ఎదురుచూస్తున్నారని తెరాస ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement