Sunday, April 28, 2024

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలవడం అసాధ్యం: డీకే అరుణ

త్వరలో జరిగే హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ తలకిందులుగా తపస్సు చేసినా గెలవలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అభిప్రాయపడ్డారు. శాసనసభలో బీజేపీకి ఈటల రూపంలో మరో ఎమ్మెల్యే పెరగబోతున్నారని అన్నారు. ఇక సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తీరుతోనే పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ మద్దతుతోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతోందని విమర్శించారు. పాలమూరు జిల్లా వాసులను సీఎం కేసీఆర్ కాళ్లతో తంతున్నాడని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: నీటి వివాదంపై చర్చించేందుకు జగన్ సిద్ధం: పేర్ని నాని

Advertisement

తాజా వార్తలు

Advertisement