Thursday, May 2, 2024

ఎస్సీల వర్గీకరణలో నెంబర్ వన్ దోషి బీజేపీ : మంద కృష్ణ మాదిగ‌

ఎస్సీ వర్గీకరణ కోసం బీజేపీ చేసిన మోసానికి నిరసనగా మార్చి 15న రెండు తెలుగు రాష్ట్రాల జాతీయ రహదారులను దిగ్బంధించుతాం చేస్తామ‌ని మందకృష్ణ మాదిగ అన్నారు. హనుమకొండ హరిత హోటల్ లో మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ విషయంలో నెంబర్ వన్ దోషి, ఎన్నికల మ్యానిపెస్టోలలో హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ నే అన్నారు. వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ నిర్లక్ష్యం చేస్తున్నద‌న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజా భరోసా యాత్ర తెలంగాణ ప్రజలకేమో గానీ ఎస్సీలకు భరోసా ఇవ్వలేదు అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏమి భరోసా ఇవ్వగలుగుతారంటూ ఎద్దేవా చేశారు. మార్చి 15న ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మెస్ పి స్టూడెంట్స్, యువత ఆధ్వర్యంలో హైదరాబాద్, విజయవాడ రెండు రహదారుల పై నిరసనలు చేప‌డ‌తామ‌న్నారు. ఇందుకోసం ఈ నెల 22 నుండి మార్చి 14 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని మండలాల నుండి రాష్ట్ర రాజధాని వరకు పాదయాత్ర చేప‌డ‌తామ‌న్నారు. మార్చి 20న ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేస్తామ‌న్నారు. అనాథ పిల్లలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రుల నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడుతాం అన్నారు. బడ్జెట్ లో మూడు లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పి అనాధ పిల్లలకు మూడు రూపాయలు కేటాయించలేదు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement