Wednesday, May 15, 2024

పవన్ తో రత్నప్రభ భేటీ

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని హైదరాబాద్ లో కలిశారు. ఈ సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పురందేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జి సునీల్ దేవధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఉపఎన్నిక కార్యాచరణ గురుంచి చర్చించినట్లు తెలిపారు. బిజెపి తరఫున రత్నప్రభ తిరుపతి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement