Thursday, May 2, 2024

బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ.. ముందే చెప్పిన ఆంధ్రప్రభ

ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి ఉపఎన్నిక కోసం బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ మేరకు మాజీ ఐఏఎస్ రత్నప్రభ పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని మూడురోజుల క్రితమే ఆంధ్రప్రభ తమ పాఠకులకు చెప్పింది. ఇప్పుడు ఆంధ్రప్రభ చెప్పిన విషయమే అక్షరాలా నిజమైంది.

కాగా ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ కర్ణాటక కేడర్ ఐఏఎస్‌గా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆమెకు ఫైర్‌ బ్రాండ్‌ ముద్ర కూడా ఉంది. అందువల్ల రత్నప్రభ అయితేనే వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement