Sunday, May 19, 2024

దేశాన్ని ముక్కలు చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్.. రాహుల్ గాంధీ

బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని ముక్కలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మాట్లాడుతూ… బీజేపీతో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరుగుతోందన్నారు. ఆ ఇద్దరు టైకూన్లు, టీవీలు, పత్రికలను కంట్రోల్ చేస్తున్నారన్నారు. ఆ ఇద్దరి కోసమే కేంద్రం పనిచేస్తోందన్నారు. ఆ ఇద్దరి మద్దతు లేకపోతే మోడీ ప్రధాని కాలేకపోయారన్నారు. పేదలు, రైతులు మోడీ విధానాలతో విసిగిపోయారన్నారు. పేదల వెన్నెముకను మోడీ విరిచేశారన్నారు. ఈ దేశం రాజ్యాంగం చెప్పినట్లు నడుచుకోవాలని.. ఆ ఇద్దరు టైకూన్లు చెప్పినట్లు కాదన్నారు. దేశాన్ని ముక్కలు చేయడమే మోడీ విధానమన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాలని మోడీ అవహేళన చేశారన్నారు. విపక్ష పార్టీలన్నీ కలిసి బీజేపీని గద్దెదించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement