Monday, April 29, 2024

Breaking: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు తప్పిన ప్రమాదం..

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈరోజు సీఎం నితీశ్ కుమార్ మరికొందరితో కలిసి ప్రయాణిస్తున్న పడవ జేపీ సేతులోని ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనతో సహా అందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారు. గంగా నది వద్ద ఉన్న ఛాత్ ఘాట్‌ను పరిశీలించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ పడవకు స్వల్ప నష్టం జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పడవలో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement