Thursday, May 2, 2024

భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో రైలు

కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ ప్రభావం హైదరాబాద్ మెట్రో రైలు మీదా పడింది. దీంతో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. కరోనా కారణంగా ప్రయాణికులు తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం వంటి కారణాలు మెట్రో రైలును భారీ నష్టాల్లోకి తీసుకెళ్లాయి. వాస్తవానికి హైదరాబాదులో మెట్రో రైలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందింది. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దాంతో తొలి సంవత్సరాలలో మంచి లాభాలనే సాధించింది. అయితే కరోనా రాకతో మెట్రో లాభాలు పట్టాలు తప్పాయి. ప్రతి రోజు సగటున రూ.5 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. ప్రతి రోజు కేవలం రూ. కోటి మాత్రమే ఆదాయం వస్తోందట.

ఈ నేపథ్యంలో ఇటీవల మెట్రో రైల్ నిర్వాహకులైన ఎల్ అండ్ టీ అధికారులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. నష్టాల్లో కూరుకుపోయిన మెట్రో రైల్ ను ఆదుకోవాలని కోరారు. దీంతో రాయితీ ఒప్పందం ప్రకారం ఏం చేయవచ్చనే దానిపై నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం, మెట్రో రైల్ కార్యాలయాన్ని కేసీఆర్ కోరారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మెట్రో రైల్ రూ. 400 కోట్ల నష్టాన్ని చవిచూసిందట. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నష్టాలు రూ. 1,500 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని మెట్రో రైల్ అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు.

ఈ వార్త కూడా చదవండి: కేబినెట్‌లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయమేది?

Advertisement

తాజా వార్తలు

Advertisement