Sunday, April 28, 2024

TS | ఇంటివద్ద‌కే భద్రాద్రి సీతారాముల‌వారి కల్యాణ తలంబ్రాలు..

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జ‌రిగే సీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇళ్లకు చేరవేసే పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టారు.

ఈ ప్రత్యేక తలంబ్రాలు కావాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సెంటర్లలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్‌లు ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌ను ఆయన ప్రారంభించారు.

భద్రాద్రిలో ఈ నెల 17వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040-23450033, 040-69440000, 040-69440069 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement