Thursday, April 25, 2024

వైసీపీలో ఉన్నానంటే అసహ్యంగా ఉంది : మాజీ మంత్రి ర‌వీంద్రారెడ్డి

కడప బ్యూరో, అంధ్రప్రభ : దివాలా అంచున ఉన్న బైజూస్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, బైజూస్ కంటెంట్ మిగితా రాష్ట్రాలు వ్యతిరేకించాయని, బైజూస్ పేరుతో ప్రభుత్వం రూ.1400 కోట్లు వృథా చేస్తుందని మాజీ మంత్రి డియర్ రవీంద్రారెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కడప ప్రెస్ క్లబ్ లో ఆయన బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బైజూస్ తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లాకు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని ఆరోపించారు. టాలెంట్ ఉన్నా మన ఉపాధ్యాయుల‌ను కాదని బైజూస్ తో పాఠాలు చెప్పాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. బైజూస్ తో ప్రభుత్వ ఒప్పందం ఒక మోసమని విమర్శించారు. బైజూస్ కోసం ఖర్చు చేస్తున్న 1400 కోట్లలో కనీసం కొంతైన ఉపాధ్యాయులకు ఖర్చు చేయాలని కోరారు.
విద్యార్థులు విషయంలో ప్రభుత్వం అవినీతి మానుకోవాలని అన్నారు.

నేను ఇంకా వైకాపాలో కొనసాగుతున్న…
నేను ఇంకా వైసిపీలోనే కొన సాగుతున్నాని, నన్ను పార్టీ నుండి తొలగించ‌లేదని అన్నారు. వైసీపీలో ఉన్నానంటే అసహ్యంగా ఉందన్నారు. అవినీతికి తావులేకుండా పరిపాలన చేస్తా అని జగన్ చెప్పాడని, నా స్నేహితుడి కుమారుడు జగన్ ఇంత అవినీతి పరుడుగా మారుతాడని ఊహించలేదన్నారు. ప్రభుత్వం అందించే చీప్ లిక్కర్ తాగి మా మండలంలో 6 మంది చనిపోయారన్నారు. తప్పు చేసిన వాడు తప్పించుకోలేరని మాట్లాడారు. చట్టం నుంచి తప్పించుకున్నా దేవుడు శిక్షిస్తాడని అన్నారు. రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు ఉండొచ్చని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని బాగుచేసే అవకాశం ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ నిజాయితీ కలిగిన నాయకుడే అని, పరిపాలనా శక్తి ఆయనకు లేదని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి కేసు జనవరి 3 తేదీ తర్వాత ఊహించని మలుపు తిరుగుతుందిని ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement