Monday, April 29, 2024

27న బీసీసీఐ ఎస్‌జీఎం సమావేశం

2023 వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ నిర్వహణ, ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ కమిటీ ఏర్పాటు, లైంగిక వేధింపుల నిరోధక విధానం ఆమోదం తదితర అంశాలు అజెండా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరుగనుంది.

అహ్మదాబాద్‌ వేదికగా ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి కార్యాలయం నోటీసులో పేర్కొంది. ఐదు అంశాల అజెండాతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 5 నుంచి వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement