Sunday, May 19, 2024

Barbarism – మణిపుర్‌ ఘటన అనాగరికం: కేటీఆర్

హైదరాబాద్‌: మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికమన్నారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు.

ఈ భయానక హింసాకాండను, శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోందని ఆక్షేపించారు. మణిపుర్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్కడ ఉన్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు.
కాగా, మ‌ణిపూర్ లో ఇద్ద‌రు యువ‌తులపై అత్యాచారం చేసి, అనంత‌రం వారిద్ద‌ర్ని న‌గ్నంగా గ్రామంలో ఊరేగించారు.. ఈ వీడియో బ‌య‌ట‌కు రావడంతో దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement