Friday, May 17, 2024

Ahmadabad – ఇస్కాన్ వంతెనపై జనాలపైకి దూసుకెళ్లిన కారు… తొమ్మిది మంది దుర్మరణం

గుజరాత్ లోని అహ్మదాబాద్‌ ఇస్కాన్ వంతెన వద్ద భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మంది తీవ్ర గాయాలయ్యాయి… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌పథ్ క్లబ్ నుండి వేగంగా వస్తున్న కారు.. వంతెనపై ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. అలాగే కారు అతివేగంగా ఉండటంతో దాదాపు క్షతగాత్రులను 30 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లి నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాద సమయంలో కారు దాదాపు 160 కి.మీ వేగంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరిగింది.

ఈ సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అలాగే ఈ ప్రమాదం సమయంలో విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌, హోంగార్డు సిబ్బంది కూడా మృతి చెందారు

మృతుల వివరాలు ఇలా ఉన్నాయి

- Advertisement -

నీరవ్ చందలోడియా, అక్షయ్ చావ్డా, బోటాడ్ నుండి రోనక్ విహల్పారియా, ధర్మేంద్ర సింగ్ (పోలీస్ కానిస్టేబుల్), బొటాడ్‌కు చెందిన క్రిణాల్ కొడియా, సురేంద్రనగర్‌కు చెందిన అమన్‌ కచ్చి, అర్మాన్ వధ్వానియా ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement