Thursday, April 25, 2024

బండి సంజయ్‌ విచారణ 18కి వాయిదా.. సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణను తెలంగా మహిళా కమిషన్‌ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్‌ సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్‌నుమార్చి 15న కమిషన్‌ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కమిషన్‌ ఆదేశించగా తనకు పార్లమెంట్‌ సమావేశాలు ఉన్న నేపథ్యంలో 15న కమిషన్‌ ఎదుట హాజరు కాలేనని లేఖ ద్వారా కమిషన్‌కు విన్నవించారు.

ఈ నెల 18న కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సూచించిన సమయానికి వి చారణకు హాజర వుతానని లేఖలో అభ్యర్ధించారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్‌ ఈ నెల ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 18న విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసు ద్వారా హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement