Monday, April 29, 2024

ఆల్‌ టైం రికార్డ్‌గా.. ఖమ్మం మార్కెట్‌ మిర్చి రేటు! క్వింటాకు 22,500 పలకడంతో రైతులకు సన్మానం

ఖమ్మం నగరం, ప్రభన్యూస్‌: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం తేజ రకం ఎండు మిర్చి కొనుగోళ్ల రేటు ఆల్‌ టైం రికార్డ్‌గా మార్కెట్‌ చరిత్రకెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి రేటు క్వింటాకు రూ.22,500 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎండుమిర్చికి జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి రేటు ఉండడం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నాణ్యమైన ఎండుమిర్చిని రైతులు తేవడంతో మంచి రేటు పలికింది. మార్కెట్‌ అధికారులు, పాలకవర్గం పకడ్బందీ చర్యలు చేపట్టడంతో మిర్చి రేట్లు ఆల్‌ టైం రికార్డుగా మారాయి.

జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దోరేపల్లి శ్వేత, మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షి మల్లేశం మార్కెట్లో జెండా పాటలను నిరంతరం పర్యవేక్షిస్తుండడంతో రైతులకు ప్రయోజనం కలుగుతోంది. మంగళవారం రూ. 21,800 పలికిన ఎండుమిర్చి రేటు ఒక్కసారిగా బుధవారం మరింత పెరిగి 22,500కు చేరడంతో నాణ్యమైన మిర్చిని పండించిన రైతు కె.నారాయణరావును, కొనుగోలు చేసిన ఖరీదు కమిషన్‌ వ్యాపారులను మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఘనంగా శాలువాలతో సన్మానించి అభినందించారు. కాగా, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దోరేపల్లి శ్వేత, ఉన్నత శ్రేణి కార్యదర్శి మార్కెట్‌లో పర్యటించి మిర్చి కొనుగోళ్లు, తోలకాలు వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement