Monday, April 29, 2024

సీఎం కేసీఆర్‌కు బండి సంజ‌య్ లేఖ

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర‌ అధ్యక్షుడు బండి సంజయ్ బ‌హిరంగ‌ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు. పోలీస్ రిక్రూట్ బోర్టు నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement