Tuesday, May 14, 2024

యువతి హత్యపై స్పందించిన సీఎం జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో యువతి హత్యకు గురైంది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పందించారు. యువతి మృతిపై సంతాపం తెలిపిన సీఎం జ‌గ‌న్‌ మృతురాలి కుటుంబానికి అధికారులు అండగా ఉండాలని సూచించారు. అదేవిధంగా రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement