Tuesday, May 7, 2024

Delhi | డీపీఆర్ వచ్చాక అలైన్‌మెంట్‌పై నిర్ణయం.. ఎంపీ నామా ప్రశ్నలకు రైల్వే మంత్రి సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలోని డోర్నకల్- మిర్యాలగూడ మధ్య కొత్త రైలు మార్గానికి సంబంధించి డీపీఆర్ సిద్ధమయ్యాకే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. డీపీఆర్‌ కోసం ఇప్పటికే సర్వే పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్‌మెంట్ విషయంలో పునఃపరిశీలన చేయడంపై ఖమ్మం పార్లమెంట్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బుధవారం రైల్వే మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. డోర్నకల్- మిర్యాలగూడ రైల్వే లైన్  అలైన్‌మెంట్ పురోగతి ఎంతవరకు వచ్చింది, తాను ప్రతిపాదించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా లేదా అని ఆయన అడగ్గా అశ్విని వైష్ణవ్ సవివరగా జవాబులో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement