Monday, May 6, 2024

”ఆజాద్ గులాం కాదు”.. పద్మభూషన్ అవార్డుపై జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్య

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ ఛట్టాచార్య, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ అవార్డును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించగా.. ఈ వార్తను జైరాం రమేష్ షేర్ చేస్తూ తన పార్టీ సహచరుడు ఆజాద్‌కు అవార్డు ప్రకటించడంపై పరిహాసంగా ట్వీట్ చేశారు.

”భట్టాచార్య అలా చేయడం సరైంది.. అతను ఆజాద్ (స్వతంత్రుడు).. గులాం (బానిస)గా ఉండాలనుకోవడం లేదు’’అంటూ ద్వంద్వార్ధం జనించేలా జైరామ్ రమేష్ ట్వీట్ చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement