Friday, May 17, 2024

అయ్యప్ప భవాని దీక్షలే కాదు… కొత్తగా భీమ్ దీక్ష

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న దీక్షకు సిద్ధం అయ్యారు. అయ్యప్పస్వామి, భవానీ దీక్షల తరహాలో భీమ్ దీక్ష దిగారు కలెక్టర్ గంధం చంద్రుడు. మనో వికాసం, సమాజ హితం కోసం ఈ దీక్ష చేపట్టినట్టు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. 30 రోజుల పాటు ఈ దీక్ష సాగనుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 దాకా కలెక్టర్ భీమ్ దీక్ష చేయనున్నారు. కాన్షిరామ్ జయంతి నుంచి అంబేద్కర్ జయంతి దాకా దీక్ష ఉండనుంది.

దీక్ష సందర్భంగా పలు నియమాలను కూడా కలెక్టర్ పాటిస్తున్నారు. చెప్పులు లేకుండా.. నీలం రంగు చొక్కా ధరించి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ 5 గంటలకు లేవటం.. భౌతిక, శ్వాస వ్యాయామాలు చేయటం, గంటసేపు అంబేద్కర్ రచనలు చదవటం.. మానసిక స్థైర్యం పెంపొందించుకోవటం వంటి నియమాలను పాటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement