Wednesday, May 15, 2024

Ayodya Sri Rama Temple – దేవుడి సేవ‌లో..భావోద్వేగానికి లోన‌వుతున్నా – ప్రధాని మోడీ….


అయోధ్య‌లో జ‌ర‌గ‌నున్న శ్రీరామ ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి ఇంకా 11 రోజులే ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ప్ర‌ధాని మోడీ త‌న ట్విట్ట‌ర్ (ఎక్స్) అకౌంట్‌లో ఆడియో సందేశాన్ని పోస్టు చేశారు. తొలిసారి తాను భావోద్వేగానికి లోన‌వుతున్న‌ట్లు తెలిపారు. తీవ్ర‌తలో ఉన్న విష‌యాన్ని శ‌బ్ధాల్లో చెప్ప‌లేక‌పోతున్న‌ట్లు వెల్ల‌డించారు. జీవితంలో తొలిసారి ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంద‌ని, ఆ ఫీలింగ్స్ అనుభ‌విస్తున్న‌ట్లు చెప్పారు.

అదృష్టంగా భావిస్తున్నాం..
అయోధ్య‌ రాముడి ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మంలో స్వ‌యంగా పాల్గొన‌డం త‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మ‌దీ తెలిపారు. కార్య‌క్ర‌మానికి సాక్షిగా నిల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు విశేష అనుష్టానంలో పాల్గొననున్న‌ట్లు చెప్పారు. ప్రాణ ప్ర‌తిష్ట కోసం ఆ భ‌గ‌వంతుడు త‌న‌ను ఓ ప‌రిక‌రంగా వాడుకుంటున్న‌ట్లు చెప్పారు. దేశ ప్ర‌జ‌ల ఆశీర్వాదాన్ని కోరుకుంటున్న‌ట్లు త‌న సందేశంలో ప్ర‌ధాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement