Wednesday, May 1, 2024

దారుణం.. కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి

  • నిందితున్ని గ్రామస్తులకు అప్పగించాలని ఆందోళన
  • పోలీసులపై గ్రామస్తుల దాడి
  • పోలీసు వాహనాలు ధ్వసం
  • గ్రామంలో ఉద్రిక్తత

    మంథని మే 11 (ప్రభ న్యూస్) : మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో కన్న కూతురు రజిత (10)లు తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురును చంపిన తర్వాత అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దూపం శ్రీనివాస్ పై దాడికి పాల్పడ్డాడు. నిందితున్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు దిగారు. పోలీసుల‌పై గ్రామ‌స్తులు దాడికి పాల్ప‌డ‌టంతోపాటు వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. దీంతో భ‌ట్టుప‌ల్లి గ్రామంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement