Monday, May 6, 2024

తెలుగు రాష్ట్రాల్లో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన..స్పష్టం చేసిన కేంద్రం..

నియోజకవర్గాల పునర్విభజనకై ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇప్పట్లో తమ కోరిక తీరేట్లు లేదు..తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు లేనట్టేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎప్పుడు చేసేది వెల్లడించింది. , తెలంగాణల్లో 2031 తర్వాతే నియోజకవర్గాలను పునర్విభజిస్తామని స్పష్టం చేశారు. 2026 జనాభా లెక్కల ప్రకారం చేపడతామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన తెలిపారు. ఏపీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో ప్రస్తుత 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 స్థానాలకు, తెలంగాణ లోని ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలను 153 స్థానాలకు పెంచాలని సూచించింది “ఏపి పునర్విభజన చట్టం”.

ఇది కూడా చదవండి: బిలిగేట్స్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement