Tuesday, May 7, 2024

Asian Games: బ్యాడ్మింటన్ పురుషుల డ‌బుల్స్ లో భారత్‌కు స్వర్ణం

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీకి స్వర్ణం లభించింది. ఫైన‌ల్స్ లో 21 – 18, 21 – 16 స్కోర్ తో దక్షిణ కొరియా జంట చోయ్ సోల్ గ్యూ, కిమ్ హోన్ హో- Korea’s Choi Sol Gyu and Kim Won Ho పై గెలుపొంది ప‌సిడిని స్వంతం చేసుకున్నారు., దీంతో ఇప్పటివరకు భారత్‌ గెలిచిన పతకాల సంఖ్య 101కి చేరింది. స్వర్ణం-26 రజతం-35 కాంస్యం-40.

మరోవైపు వర్షం కారణంగా క్రికెట్‌ ఫైనల్‌కు అంతరాయం ఏర్పడింది. 18.2 ఓవర్లు పూర్తి అయ్యేసరికి అఫ్గాన్‌ 112/5 స్కోర్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement