Monday, April 29, 2024

ఎస్‌పీఈసెట్‌కు 2672 మంది విద్యార్థుల దరఖాస్తులు.. ఈ నెల 30 దాకా చాన్స్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ – నల్గొండ నిర్వహించే టీఎస్‌ పీఈసెట్‌కు మొత్తం 2672 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు విశ్వ విద్యాలయం అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. బీపీఈడీ 2 సంవత్సరాల కోర్సు కోసం బాలురు 948 మంది, బాలికలు 626 మంది దరఖాస్తు చేసుకున్నారు. యూపీడీపీఈడీ కోర్సు కోసం బాలురు 635, బాలికలు 463 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30 వరకు లేట్‌ఫీ జుతో టీఎస్‌పీఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారవర్గాలు సూచించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement