Friday, May 3, 2024

26న కమిటీ ఎదుట హాజరు కండి.. కరీంనగర్ సీపీ, పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై దాడి, అక్రమ అరెస్టు కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 26న మధ్యాహ్నం 1.30 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణతో పాటు కరీంనగర్ ఎసీపీ(సీసీఎస్) కె.శ్రీనివాస్, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి, జమ్మికుంట సీఐ కొమ్మనేని రామచంద్రరావు, హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ చల్లమల్ల నటేష్ లకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులిచ్చింది. నోటీసుల ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్ కుమార్‌కు కూడా పంపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement