Monday, April 29, 2024

ఏపీ జాబ్ క్యాలెండర్ పై విద్యార్థుల ఆందోళనలు..మద్దతు తెలిపిన మావోలు..

ఏపీ సర్కారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.. అయితే తాజాగా ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు, నిరసనలకు తమ మద్దతు ఉంటుందని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు విశాఖ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరిట ఓ ఆడియో విడుదలైంది. ఈ ఆడియోలో అరుణ మాట్లాడుతూ, ప్రభుత్వం మోసపూరిత విధానాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలపై ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. వేల సంఖ్యలో పాఠశాలలు మూతపడ్డాయని, వేలాదిమంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ కొత్త విద్యావిధానం లోపభూయిష్టమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: కోర్టు మొట్టికాయలు వేయడంతో దిగొచ్చిన ట్విట్టర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement