Sunday, April 28, 2024

కోర్టు మొట్టికాయలు వేయడంతో దిగొచ్చిన ట్విట్టర్..

కొత్త ఐటీ చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేయడంతో ట్విట్టర్ దిగివచ్చింది. భారత గ్రీవెన్స్ అధికారి నియామకంపై ట్విట్టర్ ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించడంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు మండిపడింది. అధికారి నియామకంపై ఏదో ఒకటి తేల్చాలని ఆదేశిస్తూ ఒక్కరోజు సమయమిచ్చింది. ఇటు కోర్టు కూడా దేశ చట్టాలను అమలు చేయాల్సిందేనని ట్విట్టర్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ గా వినయ్ ప్రకాశ్ ను ఇవ్వాళ నియమించింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఈమెయిల్ ఐడీనీ సృష్టించింది. భారత కొత్త ఐటీ చట్టంలోని 4 (1) (డీ) ప్రకారం గ్రీవెన్స్ అధికారిని నియమిస్తున్నామని ప్రకటించింది. వాస్తవానికి గ్రీవెన్స్ అధికారి నియామకం కోసం 8 వారాల సమయం కావాలంటూ గురువారం ట్విట్టర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఆ లోపే గ్రీవెన్స్ అధికారిని నియమించింది.

ఇది కూడా చదవండి: వింబుల్డన్ ఫైనల్స్ లో అట్రాక్షన్ గా ప్రియాంక చోప్రా..

Advertisement

తాజా వార్తలు

Advertisement