Friday, April 19, 2024

అలా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: టీటీడీ

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించడం లేదని టీటీడీ ప్రకటించింది. తిరుమలలో తమ సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది నిరాధారమని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గతంలో ఏవిధానం అమలు జరిగేదో ఇప్పుడు కూడా అలాగే అమలు జరుగుతోందన్నారు. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించారు.

గతవారం కొందరు ప్రజా ప్రతినిధులు వారి కోటాకు మించి లేఖలు ఇచ్చారని, వీఐపీ బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించామని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఫోన్ చేసి తమకు ముఖ్యమైన వారని చెప్పడంతో వాటికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరు చేసి స్వామివారి దర్శనం చేయించినట్లు వెల్లడించారు. అలాగే గదులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తులు అవాస్తవ ఆరోపణలు చేయడం తగదని ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

ఇది కూడా చదవండి: తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Advertisement

తాజా వార్తలు

Advertisement