Sunday, May 19, 2024

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాన్ ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. జూన్ 8 నుంచి జూన్ 17 వరకు బదిలీలకు అనుమతిచ్చింది. పది రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది.
ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాలు ఉండగా… ఉగాది నుంచి అదనంగా మరో 13 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో పాత, కొత్త జిల్లాలు కలిపి మొత్తం 26 జిల్లాలు ఏర్పాడ్డాయి. సాధారణ బదిలీల్లో కొంతమందిని కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement