Sunday, April 28, 2024

AP | ఈ నెల 6నుండి ఇంజనీరింగ్‌ ప్రత్యేక దశ అడ్మిషన్లు..

అమరావతి, ఆంధ్రప్రభ : ఇంజనీరింగ్‌ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియకు ఈ నెల ఆరవ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఎపిఈఎపిసెట్‌ కన్వీనర్‌, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉన్నత విద్యామండలి జారీ చేసిన జీవో నెం.179ను అనుసరించి ఏపీఈఈసెట్‌ – 2023 లో అర్హత సాధించిన అభ్యర్థులు కోసం దీనిని నిర్దేశించామన్నారు. తొలి, మలి దశతో పాటు స్పాట్‌ అడ్మిషన్లు ఇఫ్పటికే ముగిసాయని, కేవలం ఈ సంవత్సరాలనికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్‌ ను చేపడుతున్నామని పేర్కొన్నారు.

తొలి, మలి దశ కౌన్సిలింగ్‌, స్పాట్‌ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్ధులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్‌ కు అర్హత కలిగి ఉంటారన్నారు. అయితే ఇప్పటికే ప్రవేశాల కోసం రిజిస్టేషన్‌ చేసుకున్న వారిని మాత్రమే ఈ ప్రత్యేక దశలో ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఉంటుదని, కొత్తగా రిజిస్ట్రేష్రన్లకు అవకాశం లేదని నాగరాణి స్పష్టం చేసారు.

విద్యార్ధుల నుండి భిన్న రూపాలలో వచ్చిన అభ్యర్ధనల ఫలితంగా ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ ప్రత్యేక కౌన్సిలింగ్‌ కు అనుమతి ఇచ్చారని, మరో వైపు విద్యా శాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపారని నాగరాణి పేర్కొన్నారు.

- Advertisement -

ప్రభుత్వ పథకాల వర్తింపు..

ప్రత్యేక రౌండ్‌ లో తీసుకునే ప్రవేశాలకు కూడా కన్వీనర్‌ కోటాతో సమానంగా ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ వంటి అన్ని రకాల ప్రభుత్వ పధకాలకు అనుమతి ఉందని కన్వీనర్‌ వివరించారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల లోని బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ఖాళీలను అనుసరించి, నిబంధనల మేరకు ప్రవేశం కల్పిస్తామన్నారు.

ఈ నెల 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు ఐచ్చికాల నమౌదుకు అవకాశం ఉంటుందన్నారు. 8వ తేదీ ఆప్షన్ల నమోదు, మార్పుకు అనుమతి ఉంటుందని తెలిపారు. 10వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు కేటాయించిన కళాశాలలో ఈ నెల 11 నుండి 13 వరకు విద్యార్ధులు వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉందని ఎపిఈఎపిసెట్‌ కన్వీనర్‌, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement