Thursday, May 2, 2024

కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ మీట్..

ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చించిస్తోంది కేబినెట్. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు త్వరలో నిర్వహించబోయే మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై కూడా సమీక్షించినట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న వాటి తీరుతెన్నులను సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆర్‌ అండ్ బి శాఖకు చెందిన 4 వేల కోట్ల ఆస్తులను ఆర్డీసీకి బదలాయించే అంశాన్ని కేబినెట్‌లో ప్రతిపాదించే అవకాశముంది. అలాగే ఏపీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలపై కూడా చర్చించనుంది కేబినెట్‌. మరోవైపు నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం అమలు, జాతీయ విద్యా విధానాన్ని ఏపీలో ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై చర్చించనుంది కేబినెట్‌.

ఇక నాడు- నేడు రెండో దశ పనులను ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పోలవరం ముంపు భాదితులకు అదనంగా డబ్బులు పంపిణీ చేసే అంశంపైనా నేడు చర్చించనున్నారు. పోలవరం ముంపు బాధితులకు గతంలో తక్కువ నష్ట పరిహారం ఇచ్చినవారికి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చే అంశంపై చర్చింనుంది కేబినెట్‌. నాడు-నేడు రెండో దశ పనులకు ఆమోదo తెలిపే అవకాశముంది.అలాగే ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ పాలసీ రూపకల్పన అంశం కేబినెట్‌ ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో మరోసారి విపక్షాల భేటీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement