Tuesday, April 30, 2024

మెగా మ‌ల్టీస్టార‌ర్ మూవీ నుంచి మ‌రో అప్డేట్.. రేపు ప్ర‌క‌టించ‌నున్న మేక‌ర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ క‌లిసిచేస్తున్న‌ మల్టీ స్టారర్ మూవీ BRO. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్ని ఈ సినిమా జులై 28న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. కాగా, ఈ మూవీ నుంచి రీసెంట్ గా వ‌చ్చిన ప‌వ‌ణ్ క‌ళ్యాన్ మోష‌న్ పోస్ట‌ర్ అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. రేపు సాయంత్రం 04:14 గంటలకు మూవీ నుంచి మ‌రో అప్డేట్ ఇవ్వ‌నున్న‌ట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వ‌స్తుందో అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక.. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు, రోహిణి మొల్లేటి, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండ‌గా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement