Saturday, May 18, 2024

శ్రీలంక క్రికెట్ జట్టులో మరొకరికి కరోనా పాజిటివ్

త్వరలో టీమిండియాతో వన్డే సిరీస్ జరగనుండగా శ్రీలంక జట్టులో వ‌రుస‌గా క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇంగ్లండ్ వెళ్లి వ‌చ్చిన టీమ్‌లో మొద‌ట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్ల‌వ‌ర్ క‌రోనా బారిన ప‌డ‌గా.. ఇప్పుడు ఆ టీమ్ డేటా అన‌లిస్ట్ జీటీ నిరోష‌న్‌కు కూడా క‌రోనా సోకిన‌ట్లు తేలింది. ఈ మ‌ధ్యే ఇంగ్లండ్‌లో శ్రీలంక జట్టు మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడింది‌.

ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన వెంట‌నే ఇంగ్లండ్ టీమ్‌లో ముగ్గురు ఆటగాళ్లు స‌హా మొత్తం ఏడుగురికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. అక్క‌డి నుంచి స్వదేశానికి వ‌చ్చిన శ్రీలంక టీమ్‌కు ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఇద్ద‌రికి పాజిటివ్ అని తెలిసిన‌ట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. గురువారం ఆటగాళ్లు‌, కోచింగ్‌, స‌పోర్ట్ స్టాఫ్‌కు టెస్టులు నిర్వ‌హించ‌గా నిరోష‌న్‌కు పాజిటివ్‌గా తేలిన‌ట్లు తెలిపింది. కాగా భారత్, శ్రీలంక మ‌ధ్య ఈ నెల 13 నుంచి మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ వార్త కూడా చదవండి: ఇంగ్లండ్ టీమ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్

Advertisement

తాజా వార్తలు

Advertisement