Friday, April 26, 2024

ఐపీఎల్‌లో ధోనీ పేరిట మరో అరుదైన రికార్డు..

ఐపీఎల్ 2023 లో ఇవ్వాల జరుగుతున్న 29వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సిఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ధోని తన పేరిట ఐపిఎల్‌లో అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వికెట్‌ కీపింగ్‌ చేస్తూ 200 మంది ఆటగాళ్లను ఔట్‌ చేసిన తొలి వికెట్ కీపర్ ధోనీ నిలిచాడు. ఇందులో క్యాచ్‌లు, స్టంపింగ్‌లు, రనౌట్‌లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ధోనీ కంటే ముందు ఏ వికెట్ కీపర్ కూడా ఈ రికార్డును సాధించలేకపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement