Sunday, April 28, 2024

ఇక నుంచి గర్భిణులు, బాలింతలకు ఇంటికే అంగన్వాడీ సరుకులు..

ఏపీలో గ‌ర్భిణులు, బాలింత‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. వారికి ప్ర‌తి నెల అంగ‌న్వాడీ కేంద్రంలో అందిస్తున్న సంపూర్ణ పోష‌ణ మ‌రియు సంపూర్ణ పోష‌ణ ప్ల‌స్ కింద స‌రుకులు మ‌రియు ప్ర‌స్తుతం అందిస్తున్న భోజ‌నానికి సంబంధించిన స‌రుకుల‌ను సైతం ఇక నేరుగా ఇంటికే అందించాల‌ని నిర్ణ‌యించింది. జులై 1 నుంచి సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ కింద బాలింతలు, గర్భిణులకు అందించే పోషకాహారం పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు వండి వడ్డిస్తున్న పరిమాణంలోనే ఇంటికే సరుకులు(టేక్‌ హోం రేషన్‌)(టీహెచ్‌ఆర్‌) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా 1-5 తేదీల్లో మొదటి విడతగా బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, నూనె, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం చిక్కీలు, ఎండు ఖర్జూరం అందించనున్నారు. 16-17 తేదీల్లో రెండో విడతగా పాలు, కోడిగుడ్లు, ఇవ్వనున్నారు. అదేవిధంగా గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న 500 గ్రాముల వంతున జొన్న పిండికి బదులుగా కిలో రాగి పిండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement