Thursday, May 2, 2024

ఏప్రిల్‌ 2 ఉగాది సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా.. ఏప్రిల్‌ 2వ తేదీని సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు నోటిఫికేషన్‌ ఇచ్చారు. విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్‌ 2న సెలవు దినంగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలావుండగా ఉగాది రోజున కొత్త జిల్లాల ప్రకటనతో ప్రభుత్వం ఏప్రిల్‌ 2న ఉగాది రోజున సెలవు లేనట్లు- ప్రకటన చేసింది. అయితే దీనిపై ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు వెళ్లాయి. దీనికి తోడు కొత్త జిల్లాల ఆవిర్భావ తేదీని ప్రభుత్వం ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేయడంతో ఉగాది పండుగను సెలవు దినంగా ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement