Wednesday, May 15, 2024

Delhi | అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రగతి మైదాన్ లో ఆంధ్రప్రదేశ్ డే వేడుకలు జరిగాయి. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ వేడుకలలో ఏపీఐడీసీ చైర్ పర్సన్   బండి శివశక్తి నాగేంద్ర పుణ్యశీల పాల్గొన్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ సందర్శించి స్టాల్స్ నిర్వహిస్తున్న వారితో సంభాషించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ కూడా ఏపీ పెవిలియన్ ను సందర్శించి స్టాల్స్  నిర్వాహకుల అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ తరఫున  జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్లు సుధాకర్, భాను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement