Monday, April 29, 2024

Indrakeeladri – దుర్గమ్మ ఆలయ ట్రస్టు బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు పై హత్యాయత్నం…

..విజయవాడ నవంబర్ 24 (ప్రభ న్యూస్): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి .ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు పై హత్యాయత్నం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు తూటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి ఇటీవలే మరణించిన నేపథ్యంలో ప్రతిరోజు ఆయన అజిత్ సింగ్ నగర్ లో ఉన్న బెరలి గ్రౌండ్ కి వెళ్లి తండ్రి సమాధి వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం తండ్రి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో ఒక అగంతకుడు వచ్చి కర్ణాటక రాంబాబును బాటిల్తో పొడిచేందుకు ప్రయత్నించాడు

. కళ్ళు తెరిచి చేరుకునే లోపే రాంబాబుని పొట్టలో అగంతుకుడు బాటిల్తో పొడిచాడు. అప్రమత్తమైన రాంబాబు తప్పించుకునే క్రమంలో దుండగుడికి దూరంగా జరిగే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన పొట్లో సుమారు రెండు అంగుళాలు మేర బాటిల్ ను అగంతకుడు పొడిచాడు. దీంతో అప్రమత్తమైన ఆయన సహచర మిత్రులు సిబ్బంది అగంతకుడిని నిలువరించే ప్రయత్నం చేశారు.

వెంటనే దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి కర్నాటి రాంబాబుని తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి సుమారు రెండు అంగుళాల మేర ఆయన పట్లో పొడిచిన బాటిల్ను తీశారు. కుట్లు వేసి అనంతరం ప్రథమ చికిత్స చేసి రాంబాబు స్వగృహానికి తరలించారు. తండ్రి సమాధి వద్ద పూజలు నిర్వహించేందుకు వచ్చిన కర్నాటి రాంబాబు పై హత్యాయత్నానికి ప్రయత్నించిన అగంతుకుడి వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు నిమగ్నమై ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement