Tuesday, May 7, 2024

గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి ఈరోజు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో జగన్ దంపతులు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ అనంతరం వీళ్లిద్దరూ కొద్దిసేపు అబ్జర్వేషన్‌లో ఉండనున్నారు. సీఎం జగన్‌కు టీకా వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అంతకముందు సీఎం జగన్‌కు వ్యాక్సిన్‌ వేసేందుకు గుంటూరులోని సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రం, రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్‌ రూమ్, అబ్జర్వేషన్‌ రూమ్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ బుధవారం పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement