Thursday, May 2, 2024

అమితాబ్ కు ఫస్ట్ డోస్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్నా.. వ్యాక్సినేషన్ కార్యక్రమంగా కూడా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తీసుకోగా.. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం తన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని బిగ్ బీ తెలిపారు. అభిషేక్ మినహా కుటుంబం అంతా వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు.

గతేడాది అమితాబ్​తో పాటు అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్​ వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత వీరంతా కోలుకుని షూటింగ్​లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ‘దాస్వీ’ అనే చిత్రంలో బిగ్ బీ నటిస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర, హేమా మాలిని, మోహన్ ​లాల్, జితేంద్ర, కమల్ హాసన్, నాగార్జున, రోహిత్ శెట్టి, నీనా గుప్తా, రాకేశ్ రోషన్, జానీ లీవర్ తదితర నటులు కరోనా తొలి డోసు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement