Saturday, April 20, 2024

ఆకాష్ పూరీ హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ఇచ్చిన హిట్ జోష్ తోనే వరుస సినిమాలను ఒకే చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణంలో తమిళ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేసాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి.

ఈ ఇక ఈ సినిమాలో వైష్ణవ తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తోంది. దర్శకుడు గిరీశాయ గతంలో ఆదిత్య వర్మ సినిమాను తెరకెక్కించి విజయం అందుకున్నాడు. ఈ సినిమా తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రంలో. ఈ చిత్రంలో విక్రమ్ కొడుకు నటించారు. ఇక కొత్త చిత్రానికి సంబంధించి సాయిధరమ్ తేజ్ క్లాప్ కొట్టగా…. తల్లి విజయదుర్గా కెమెరా స్విచ్చాన్ చేశారు. వీటితోపాటు మరికొన్ని సినిమాలను కూడా వైష్ణవ్ తేజ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement