Saturday, May 4, 2024

జీక్యూ అవార్డు అందుకున్న.. తొలి తెలుగు న‌టుడు అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ప్ర‌తిష్టాత్మ‌క జీక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు వ‌చ్చింది. తమ అభిమాన నటుడికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల అల్లు అర్జున్ ప్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. పుష్ప సినిమాకు సైమా, ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు వచ్చాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ సీఎన్‌ఎన్‌ 18 ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -2022 గా నిలిచారు. ప్రస్తుతం బన్నీ మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.

ప్రముఖ మేగజీన్‌ జీక్యూ అందించే ప్రతిష్టాత్మక పురస్కారం అల్లు అర్జున్ కి దక్కింది. జీక్యూ అవార్డు 2022కి సంబంధించిన జీక్యూ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుని అందుకున్నారు. అంతేకాదు ఆయన్ని లీడింగ్‌ మ్యాన్‌గా పొగడ్తల లో ముంచెత్తారు.. తాజాగా ఫలక్‌నూమా ప్యాలెస్‌ లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement