Thursday, May 2, 2024

సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ ఎగ్జామ్ పై UPSC కీలక ప్రకటన విడుదల..

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్ పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా ఓ ప్రకటన చేసింది. మెయిన్స్‌ ఎగ్జామ్స్ వాయిదా అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ వాయిదా పడుతాయని కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోల‌న నెల‌కొంది.

అయితే ఆ వార్త‌ల‌న్నా ఫేక్ అంటూ యూపీఎస్సీ అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 7 నుంచి యథావిధిగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ నెల 7, 8, 9, 15, 16 తేదీల్లో సివిల్స్ ఎగ్జామ్ జరగనుండ‌గా.. ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement