Saturday, April 20, 2024

సంక్రాంతికి ‘స‌ర్కారు వారి పాట’ నుండి ఫ‌స్ట్ సింగిల్

జ‌న‌వ‌రి 13న స‌ర్కారు వారి పాట చిత్రం రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ కానుంద‌ని ఏప్రిల్ 1కి స‌ర్కార్ వారి పాట‌ని వాయిదా వేశారు. కాగా సంక్రాంతి కానుక‌గా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయ‌నున్నార‌ట చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తున్నారు. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే ఈ కథలో నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఇక ఒక ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిషోర్ సందడి చేయనున్నా మైత్రీ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం మోకాలు సర్జరీ కారణంగా మహేశ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement