Monday, April 29, 2024

TS: కేసీఆర్‌ను పరామర్శించిన అక్బరుద్దీన్ ఒవైసీ

సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని అక్బరుద్దీన్ ఆకాంక్షించారు.

కేసీఆర్ కాలు జారి కింద ప‌డ‌డంతో ఆయ‌న‌కు హిప్ రిప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కేసీఆర్ వాక‌ర్ సాయంతో న‌డుస్తున్నారు. మ‌రో ఐదారు వారాల పాటు కేసీఆర్‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement